కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు లేవు

ABN , First Publish Date - 2022-10-03T04:08:03+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తున్నా రని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ధర్మారావుపేటలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు లేవు
దర్మారావుపేటలో చీరలను పంపిణీ చేస్తున్న సురేఖ, ప్రేంసాగర్‌రావు

కాసిపేట, అక్టోబరు 2: కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తున్నా రని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ధర్మారావుపేటలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని, సామాన్య ప్రజలు పండగలు జరుపుకోలేకపోతు న్నార న్నారు. రఘుపతి రావు ట్రస్టు ద్వారా 85 వేల బతుకమ్మ చీరలను పంపిణీ చేశామన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ఎఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, నాయ కులు సిద్దం తిరుపతి, ఎంపీటీసీలు పర్వతి మల్లేష్‌, మడావి భీంరావు, మేరుగు పద్మశంకర్‌, స్ధానిక నాయకులు , సర్పంచులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-10-03T04:08:03+05:30 IST