అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ....
ABN , First Publish Date - 2021-01-16T04:59:59+05:30 IST
అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ అంటూ ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం, చూపరులను కలిచి వేసింది.
మరిగే పాలలో పడి బాలుడి మృతి
బద్వేలు రూరల్/గోపవరం, జనవరి 15: అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ అంటూ ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం, చూపరులను కలిచి వేసింది. మరిగే పాళ్లలో పడి చిన్నారి మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని ఆతల్లి ఆవేదన చెప్పనలివి కాలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ప్రాణం పోగొట్టుకున్న చిన్నారి ఉదంతంలోకెళితే....
మున్సిపల్ పరిధి మడకలవారిపల్లె వాసులు కప్పరపు సురేష్ - శ్రావణిల కుమారుడు మూడేళ్ల చిన్నారి ప్రణీత వేడి పాలలో పడి మృతి చెందాడు. సురేష్ దంపతులు బ్రహ్మంగారిమఠం మండలం పలుగురాళ్లపల్లెకు బం ధువుల ఇంట శుభాకార్యానికి వెళ్లారు. అయితే శుభకార్యం రోజున ఇంట్లో కాంచి పెట్టిన 20 లీటర్ల వేడిపాలలో చిన్నారి పడడంతో గాయాలపాలయ్యాడు.
కాగా బాలుడు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబీకులు ఏమీ కాలేదని భావించారు. గురువారం రాత్రి హఠాత్తుగా చిన్నారికి ఫిట్స్ రావడం, క్షణాల్లోనే మృతి చెం దడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. మరణించిన ప్రణీత ను శుక్రవారం స్వగ్రామం మడకలవారిపల్లెకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.