అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-06T04:40:51+05:30 IST

భోగాపురంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ట్రైనీ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి, కుటుంబ సభ్యులు బుధవారం తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 3వ తేదీన కనిపించకుండా పోయిన ఇదే గ్రామానికి చెందిన బమ్మిడి శ్రీనివాస్‌ (22) గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక చెరువులో ఉన్న బావిలో శవమై కనిపించా డు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

భోగాపురం : భోగాపురంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ట్రైనీ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి, కుటుంబ సభ్యులు బుధవారం తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 3వ తేదీన కనిపించకుండా పోయిన ఇదే గ్రామానికి చెందిన బమ్మిడి శ్రీనివాస్‌ (22) గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక చెరువులో ఉన్న బావిలో శవమై కనిపించాడు. స్థానిక హైస్కూల్‌ ఎదురుగా జాతీయరహదారి పక్కన శ్రీనివాస్‌ తన తల్లి రమణమ్మ, మరో సోదరుడుతో కలిసి నివాసం ఉంటున్నారు. తండ్రి గోవిందరావు రెండేళ్ల కిందటే మృతి చెందడంతో తల్లి  కాయకష్టంతో  పిల్లలను పోషించుకుంటుంది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ రాత్రి శ్రీనివాస్‌ ఇంటిల్లో భోజనం చేస్తుండగా ఫోన్‌ రావడంతో బయటకి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఎంతకీ కుమారుడు రాకపోవడం... మరుసటి రోజు కూడా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన రమణమ్మ... తమ బంధువులు, శ్రీనివాస్‌ స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయ వెనుక చెరువులో ఉన్న బావి వద్ద చెప్పులు ఉండడంతో స్థానికులు పరిశీలించారు. బావిలో శ్రీనివాస్‌ మృతదేహం ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రమణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకి తీయగా... ముఖంపై చిన్న, చిన్న గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ వచ్చిన తర్వాతే బయటకు వెళ్లిన శ్రీనివాస్‌ శవమైన కనిపించడంపై రమణమ్మ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పదంగా మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.


సిరిపురంలో వృద్ధుడు...

గంట్యాడ : సిరిపురం సమీపంలో గల ఐరన్‌ కంపెనీ వద్ద ఎస్‌.కోట మండలం ధర్మవరం గ్రామానికి  చెందిన రంబ గౌరినాయుడు (74) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌరి నాయుడు తన భార్యతో కలిసి ఉదయం ఎస్‌.కోట నుంచి మండల పరిధి మురపాకలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చారు. తన భార్యను కుమార్తె ఇంటి వద్ద విడిచి పెట్టి, తిరిగి స్వగ్రామానికని బయలుదేరి వచ్చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో... సిరిపురం సమీపంలో ఉన్న ఐరన్‌ కంపెనీ వద్ద శవమై కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు గంట్యాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Updated Date - 2021-05-06T04:40:51+05:30 IST