ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-27T05:34:03+05:30 IST

ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ఆహరభద్రత కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నూతన రేషన్‌ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, జూలై 26: ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ఆహరభద్రత కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజలు రేషన్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూం లు, ఫించన్లపై ఎక్కువగా తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం నూతన రేషన్‌కార్డులు అర్హులందరికీ అందాయని, తర్వాత డబుల్‌బెడ్‌రూంలు, పింఛన్లు సైతం అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. దళితుల కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. రూ.40కోట్లతో వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించామని, ప్రస్తుతం కళ్యాణి, తిమ్మారెడ్డి నీటితో కళకళలాడుతున్నాయన్నారు. గతంలో ఉన్న నాయకులు నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రతీ చిన్నవిషయాన్ని తీసి సోషల్‌మీడియాలో పెట్టె వారికి త్వరలోనే తగిన బుద్ది చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ రాధ, జడ్పీటీసీ ఉషాగౌడ్‌, శంకర్‌నాయక్‌, ఎంపీపీలు మాదవి, రాజ్‌దాస్‌, ఆర్డీవో శ్రీను, తహసీల్దార్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:34:03+05:30 IST