గొడుగుతో వస్తేనే...

ABN , First Publish Date - 2020-07-02T11:01:57+05:30 IST

ఎండా లేదు.. వానా లేదు.. వాతావరణం చల్లగానూ ఉంది. అయితే ఎందుకు వీరంతా గొడుగులేసుకుని వరుసగా నిలుచునున్నారు..?

గొడుగుతో వస్తేనే...

ప్రొద్దుటూరు క్రైం, జూలై 1 : ఎండా లేదు.. వానా లేదు.. వాతావరణం చల్లగానూ ఉంది. అయితే ఎందుకు వీరంతా గొడుగులేసుకుని వరుసగా నిలుచునున్నారు..? మద్యం దుకాణాల వద్ద మందుబాబులు భౌతిక దూరం పాటించేందుకు ప్రొద్దుటూరు పోలీసులకు వచ్చిన వినూత్న ఆలోచన ఇది. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. ఇలాగైతే కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందుతుందనే క్రమంలో, నివారించే దిశగా ప్రొద్దుటూరు పోలీసులు మద్యం దుకాణాల ముందు పాతసైకిల్‌ టైర్లు ఉంచి, ఆ టైర్ల మద్యలో నిల్చుని మద్యం తీసుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.


అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. దీంతో కొత్తగా అలోచించిన పోలీసు అధికారులు గొడుగు చిట్కాను కనుగొన్నారు. గొడుగులు వేసుకుని వస్తేనే మద్యం ఇస్తామని చెప్పారు. దీంతో మందుబాబులు తప్పనిసరై గొడుగులు వేసుకుని మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. గొడుగులతో భౌతికదూరం అమలైనట్లయింది. వర్షంలో, మండుటెండల్లోనే గొడుగులు వాడటం చూసిన జనం.. ఇపుడు మందు కోసం గొడుగులతో క్యూలో నిల్చోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2020-07-02T11:01:57+05:30 IST