అదుపు తప్పి వాహనం బోల్తా
ABN , First Publish Date - 2021-04-13T07:25:41+05:30 IST
జిల్లాలోని నిర్మల్ మండల జాతీయ రహదారి మీదుగా బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టిన సందర్భంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందా రని నిర్మల్ మండల ఎస్సై మిథున్ తెలిపారు.
ఒకరి మృతి, పలువురికి గాయాలు
నిర్మల్ రూరల్, ఏప్రిల్ 12 : జిల్లాలోని నిర్మల్ మండల జాతీయ రహదారి మీదుగా బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టిన సందర్భంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందా రని నిర్మల్ మండల ఎస్సై మిథున్ తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బొలెరో వాహనం హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ వెళ్తుండగా నిర్మల్ సమీపంలో గల నీలాయిపేట్ వద్ద గల జాతీయ రహ దారిపై మితిమీరిన వేగంతో నడిపారు. సోమవారం ఉదయం అతివేగంగా డివైడర్ను ఢీకొట్టిన సంఘటన లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యా యన్నారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.