వైద్యుల అకాల మరణం బాధాకరం

ABN , First Publish Date - 2021-05-16T05:24:23+05:30 IST

మిమ్స్‌ కళాశాలలో అనస్థీషి యా విభాగ ఆచార్యులు డాక్టర్‌ వరప్రసాద్‌ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అనస్థీషియా వైద్యుల సమాఖ్య జిల్లా శాఖ ప్రతినిధులు డాక్టర్‌ డీవీజీ శంకరరావు, డాక్టర్‌ రామారావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైద్యుల అకాల మరణం బాధాకరం

నెల్లిమర్ల/ విజయనగరం రూరల్‌: మిమ్స్‌ కళాశాలలో అనస్థీషి యా  విభాగ ఆచార్యులు డాక్టర్‌ వరప్రసాద్‌ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అనస్థీషియా వైద్యుల సమాఖ్య జిల్లా శాఖ ప్రతినిధులు డాక్టర్‌ డీవీజీ శంకరరావు, డాక్టర్‌ రామారావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యుడిగా, అధ్యాపకుడిగా, అనస్థీషియా సమాఖ్య పూర్వ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. అదే విధంగా మిమ్స్‌ కళాశాల విశ్రాంత డీన్‌ డాక్టర్‌ నారాయణరాజును కోల్పోవడం అత్యంత బాఽధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

Updated Date - 2021-05-16T05:24:23+05:30 IST