అంతటా త్రివర్ణ పతాక రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-13T06:17:27+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాద్యాయులు జాతీయ జెండాలను చేతపట్టి ర్యాలీలు నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు.

అంతటా త్రివర్ణ పతాక రెపరెపలు
కే వెంకటాపురంలో 75 ఆకారంలో ఏర్పడిన విద్యార్థులు

ఎస్‌. రాయవరం, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాద్యాయులు జాతీయ జెండాలను చేతపట్టి ర్యాలీలు నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. దార్లపూడిలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, ధర్మవరం అగ్రహారం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు శాంతి ప్రసూన, ఎస్‌వీ రమణారావు, ఉపాధ్యాయులు దాసు, ఎల్‌ శ్రీను, రాజు, ప్రసాద్‌, శ్రీను పాల్గొన్నారు.

కే వెంకటాపురంలో..

కోటవురట: కోటవురట్ల మండలం కే వెంకటాపురం జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు 75 ఆకారంలో ఏర్పడి ఆకట్టుకున్నారు. అలాగే గ్రామ పంచాయతీలో మండల ప్రత్యేక అధికారి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఈవోపీఆర్‌డి ప్రేమసాగర్‌, తహసీల్దార్‌ ప్రసాదరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T06:17:27+05:30 IST