ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

ABN , First Publish Date - 2020-09-30T06:49:02+05:30 IST

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

యాచారం : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మండల ఇన్‌చార్జి ఎంఈవో వినోద్‌కుమార్‌ తెలిపారు. మండల పరిధి కుర్మిద్ద ఉన్నత పాఠశాలకు చెందిన అచ్చన మల్లేష్‌ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మంగళవారం మల్లే్‌షను వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా బుధవారం పదవీ విరమణ చేయనున్న వినోద్‌కుమార్‌ను టీఎ్‌సయూటీఎఫ్‌ నాయకులు ఎమ్మార్సీ భవన్‌లో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు నర్సింహ, లక్ష్మణ్‌, అంజయ్య, శ్రీకాంత్‌, ఆంజనేయులు, కృష్ణయ్య, యాదయ్య,కృష్ణవేణి, శేఖర్‌, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T06:49:02+05:30 IST