రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి
ABN , First Publish Date - 2022-05-24T05:49:51+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి
చేవెళ్ల/యాచారం, మే 23: పెట్రోల్, డీజిల్, వంటగ్యా్సపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రధాని మోదీ చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమూ తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, శ్రీనివా్సగుప్తా, శ్రీనివా్సరెడ్డి, చాకలి శ్రీను, చంద్రశేఖర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మధుకర్, సత్యం, శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి , నాయకులు నడికూడి కృష్ణ, రమేష్, శేఖర్, వెంకటేష్, వెంకటరెడ్డి, వేణు, శ్రీనివాస్, శ్రీనాథ్ ఉన్నారు.