తల్లిని చంపిన కొడుకు

ABN , First Publish Date - 2022-07-03T04:59:30+05:30 IST

ఆస్తి పంచివ్వలేదని నిత్యం తల్లితో గొడవ పడుతూ చివరకు ఇంట్లోని రొట్టెలు చేసే బండ రాయితో మోది చంపాడో కన్న కొడుకు.

తల్లిని చంపిన కొడుకు
కర్రెమ్మ(ఫైల్‌)

మహమ్మదాబాద్‌ జూలై 2 : ఆస్తి పంచివ్వలేదని నిత్యం తల్లితో గొడవ పడుతూ చివరకు ఇంట్లోని రొట్టెలు చేసే బండ రాయితో మోది చంపాడో కన్న కొడుకు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మహమ్మదాబాద్‌ మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన గుట్ట కర్రెమ్మ (68)కు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారందరికీ వివాహాలు కావడంతో తల్లిదండ్రుల పేరున ఉన్న 4.20 ఎకరాల భూమిని పంచివ్వాలని అన్నదమ్ములు తల్లిదండ్రులతో గొడవ పడేవారు. శుక్రవారం కూడా పెద్ద కుమారుడు పండయ్య భూమి పంచివ్వాలని తల్లిని గట్టిగా నిలదీశాడు. మాటమాట పెరగడంతో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న రొట్టెల బండరాయితో ఇంటి ముందు కూర్చున్న తల్లి తలపై కొట్టాడు. తీవ్ర గాయం కావడంతో ఇంటి పక్కల వారు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్‌ ఎస్‌ఐ రవిప్రకాశ్‌ తెలిపారు.

Updated Date - 2022-07-03T04:59:30+05:30 IST