యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-06-24T05:43:33+05:30 IST

లాక్‌డౌన్‌లో అనాథలకు నిత్యం అన్నదానం చేసిన యువజన కాంగ్రెస్‌ నాయకుల సేవలు అభినందనీయమని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల సేవలు అభినందనీయం
సూర్యాపేటలో దామోదర్‌రెడ్డిని సన్మానిస్తున్న కార్యకర్తలు

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 23: లాక్‌డౌన్‌లో అనాథలకు నిత్యం అన్నదానం చేసిన యువజన కాంగ్రెస్‌ నాయకుల సేవలు అభినందనీయమని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్‌హౌస్‌లో బుధవారం జరిగిన యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కరోనా కాలంలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన రోగులు, రోగుల సహాయకులకు 28 రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్పవిషయమన్నారు. నిత్యం అన్నదానం చేసిన యువజన కాంగ్రెస్‌ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, బైరు శైలేందర్‌గౌడ్‌లను అభినందించారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, పోలగాని బాలుగౌడ్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, రాంబాబు, రవి, రాజు, సోహేల్‌ ఉన్నారు.  

ఆత్మకూర్‌(ఎస్‌): మండలంలోని గట్టికల్‌ గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకుడు పెరుమాళ్ళ శ్రీకాంత్‌ లక్ష్మి మృతిచెందగా బుధవారం దశదినకార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి హాజరై లక్ష్మి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, కోతి గోపాల్‌రెడ్డి, కందాల వెంకట్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, పాండునాయక్‌, మధుకర్‌రెడ్డి, శిగ శ్రీను, రాంరెడ్డి, నారబోయిన లింగయ్య, అయోధ్య, లింగారెడ్డి, సత్తిరెడ్డి, యల్లయ్య, కర్ణాకర్‌, లింగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:43:33+05:30 IST