మేడ్చల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం
ABN , First Publish Date - 2022-08-20T05:29:03+05:30 IST
మేడ్చల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం
- హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
- బీజేపీలో చేరిన ఘట్కేసర్ ఎంపీపీ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 19: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం శామీరపేటలోని ఈటల నివాసంలో ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, అవుషాపూర్ సర్పంచ్ కావేరిమశ్చేందర్రెడ్డి, మర్రిపల్లిగూడ ఉపసర్పంచ్, అవుషాపూర్, ఎదులాబాద్, మర్రిపల్లిగూడకు చెందిన పలువురు వార్డుసభ్యులు, టీఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీన్రెడ్డి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ బాలుయాదవ్, మశ్చేందర్రెడ్డి, బసవ రాజుగౌడ్, మరికొందరు నాయకులు, కార్యకర్తలకు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి రాజేందర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండ సీఎం కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. చాలా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, కొం పల్లి మోహన్రెడ్డి, మండల అధ్యక్షుడు చలువాది ప్రవీన్రావు, ప్రధాన కార్యదర్శి ప్రభంజన్గౌడ్, రామో జీ, దామోదర్రెడ్డి, ఎర్రోల్ల కుమారస్వామి, కరుణాకర్, చిరంజీవి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.