సామాజిక మార్పులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2021-10-20T04:43:23+05:30 IST
సామాజిక మార్పులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
- జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి
మేడ్చల్: సామాజిక మార్పులో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పట్టణంలోని జంగలక్ష్మయ్య ఫంక్షన్హాల్లో బాల వికాససంస్థ ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులకు సమర్ధ నాయకత్వం, స్థానిక వనరుల వినియోగం, సామాజిక మార్పులో ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన నాయకత్వం ప్రాముఖ్యం, లోపాలు, నాయకునికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. బాల వికాస సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న పథకాలను వివరించారు. గ్రామాలలో వనరులు వినియోగం గురించి తెలియజేశారు. జడ్పీసీఈవో రమాదేవి మాట్లాడుతూ బాల వికాసం చేపడుతున్న ప్రతీ కార్యక్రమం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు పద్మజగన్రెడ్డి, ఎల్లుభాయ్, సుదర్శన్రెడ్డి, డీఎల్పీవో సునీత, మంజుల రెడ్డి , వసంత, రాధిక, కావ్య, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.