తెలంగాణ ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-08-20T06:05:23+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

తెలంగాణ ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం

రవీంద్రభారతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతికుమార్‌ హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసి న చిత్రాలను వారు తిలకించారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, టీపీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్‌, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, టీఈఎంజేయూ అధ్యక్షుడు ఇస్మాయిల్‌, యోగి, వినయ్‌ మడపు, శ్రీనివా్‌సశెట్టి, సర్వే్‌షరెడ్డి, చిన్న యాదగిరిగౌడ్‌, ముజిబ్‌, పరమేశ్వర్‌, శ్రీనివాస్‌, కృష్ణ తదిరులు పాల్గొన్నారు. పోటీలకు 256 ఎంట్రీలు రాగా 626 ఫొటోలకు గాను 504 చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. 


Updated Date - 2022-08-20T06:05:23+05:30 IST