స్థలసమస్య పరిష్కరించాలని విశ్వబ్రాహ్మణుల వినతి

ABN , First Publish Date - 2021-01-14T05:20:53+05:30 IST

భైంసా పట్టణంలో విశ్వబ్రాహ్మణ మఠం స్థలసమస్య పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి వినతిపత్రం సమ ర్పించారు.

స్థలసమస్య పరిష్కరించాలని విశ్వబ్రాహ్మణుల వినతి
ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పిస్తున్న విశ్వబ్రాహ్మణ నాయకులు

భైంసా క్రైం, జనవరి 13 : భైంసా పట్టణంలో విశ్వబ్రాహ్మణ మఠం స్థలసమస్య పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి వినతిపత్రం సమ ర్పించారు. బుధవారం విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు ఆయనతో మాట్లాడుతూ కల్లూరులో గ్రామ పెద్దలు అందరూ కలిసి విశ్వబ్రాహ్మణ మఠంకు 50 ఏళ్ల క్రితం స్థలం కేటాయించారన్నారు. ఆనాడు గ్రామపెద్దలందరూ ఇచ్చిన స్థలాన్ని ప్రస్తుతం కొందరు ఆక్రమించు కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, డీఎస్పీ నర్సింగ్‌రావు సమస్య పరిష్కారం కొరకు త్వరలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ విశ్వబ్రాహ్మణులకు హామీ ఇచ్చారు.  విశ్వబ్రాహ్మణ మఠం జిల్లా కార్యదర్శి కే. శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి భూమన్న, మోహన్‌, కల్లూరు కులపెద్దలు, తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2021-01-14T05:20:53+05:30 IST