పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-01-27T05:40:36+05:30 IST

పీఆర్సీని ప్రకటించాలని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
మాస్కులు పెట్టుకొని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

శంకరపట్నం, జనవరి 26: పీఆర్సీని ప్రకటించాలని కోరుతూ మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు వినూత్నంగా పీఆర్సీ అనిరాసి ఉన్న మాస్కులు పెట్టుకొని మంగళవారం స్కూల్‌ ఆవరణలో కనిపించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మమతగౌతమి, ఉపాధ్యాయులు సురేందర్‌, చక్రధర్‌, షఫీ, శంకరయ్య, రాజ్‌కుమార్‌, మాధవి, సునీత, శోభ, తిరుపతి, నాగయ్య, తిరుపతయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:40:36+05:30 IST