బందరు యువతికి ప్రపంచ సౌందర్యలహరి పోటీల్లో రెండవస్థానం

ABN , First Publish Date - 2020-08-03T09:38:49+05:30 IST

వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌-2020లో బందరు యువతి మొవ్వ శ్రీసాయిసాత్విక పోటీల్లో రెండవస్థానంలో నిలిచింది.

బందరు యువతికి  ప్రపంచ సౌందర్యలహరి పోటీల్లో రెండవస్థానం

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌-2020లో బందరు యువతి  మొవ్వ శ్రీసాయిసాత్విక  పోటీల్లో రెండవస్థానంలో నిలిచింది. తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌అమెరికా(తానా) ఆధ్వర్యంలో ఈ  పోటీలను ఆన్‌లైన్‌లో   శనివారం నిర్వహించారు. 44 దేశాలనుంచి వెయ్యిమందికి పైగా  ఈ పోటీల్లో పాల్గొన్నారు. 13నుంచి19 సంవత్సరాల సౌందర్యలహరి(టీన్‌బ్యూటీపేజియంట్‌)  విభాగంలో  మచిలీపట్నం నుంచి ఈ వేడుకల్లో పాల్గొన్న  శ్రీసాయిసాత్విక రెండో స్థానంలో నిలిచి వెండిపతకాన్ని దక్కించుకుంది. సాత్విక తండ్రి మొవ్వ  వేణుమాధవ్‌ మచిలీపట్నం ఎల్‌ఐసీ కార్యాలయంలో  మేనేజరుగా పనిచేస్తున్నారు.  అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సాత్వికను  పలువురు పట్టణ  ప్రముఖులు అభినందించారు. 

Updated Date - 2020-08-03T09:38:49+05:30 IST