పద్మశాలి కులస్థులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-19T06:03:54+05:30 IST

పద్మశాలి కులస్థులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యం కల్పించాలని పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక వుడా కాలనీలో పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు.

పద్మశాలి కులస్థులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి
సంఘీభావం తెలుపుతున్న పద్మశాలి సంఘం సభ్యులు

గోపాలపట్నం, మే 18: పద్మశాలి కులస్థులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యం కల్పించాలని పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక వుడా కాలనీలో పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి కులస్థులు ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ  సముచిత స్థానం  కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  జనాభా ప్రాతిపదికన చట్ట సభల్లో  తమకు సీట్లు కేటాయించి, తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలో పద్మశాలి రాష్ట్ర మహాసభ నిర్వహించి తమ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు చింతల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పప్పు రాజారావు,  జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:03:54+05:30 IST