చెరువులో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-04-16T07:14:20+05:30 IST

చంద్రగిరి మండలంలోని చిన్నరామాపురం పంచాయతీ మూలపల్లె చెరువులో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

చెరువులో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
రఘుపతి యాదవ్‌ మృతదేహం

చంద్రగిరి, ఏప్రిల్‌ 15: చంద్రగిరి మండలంలోని చిన్నరామాపురం పంచాయతీ మూలపల్లె చెరువులో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెరువులో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలుపలకు తీసి, పరిశీలించగా మండలంలోని యల్లంపల్లెకు చెందిన రఘుపతి యాదవ్‌(77)గా తేలింది. ఈయన కొన్నేళ్లుగా తిరుపతిలో కాపురం ఉంటున్నారు. చెరువు వద్ద ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-16T07:14:20+05:30 IST