ఓడెడ్ వంతెనను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-06-21T06:23:57+05:30 IST
మండలంలోని ఓడెడ్ మానేరుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే కరువయ్యారని, వెం టనే వంతెన నిర్మాణం పూర్తిచేయాలని మంథని ఎమ్మేల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు.
- ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు
- వైద్య సిబ్బందికి శానిటైజర్, నిత్యావసర వస్తుల పంపిణీ
ముత్తారం జూన్ 20: మండలంలోని ఓడెడ్ మానేరుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే కరువయ్యారని, వెం టనే వంతెన నిర్మాణం పూర్తిచేయాలని మంథని ఎమ్మేల్యే దుద్దిళ్ళ శ్రీధర్బాబు అన్నారు. ఆదివారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కరోనా బాధితులకు మనోధైర్యాన్ని కల్పించడంలో భాగంగా బాధితులను కలిసి వైద్య, గ్రామపంచాయతీ సిబ్బందికి మాస్క్లు, శానిటైజర్లు, నిత్యావసర సరు కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరుపై వంతె న నిర్మాణానికి సుమారు రూ.42 కోట్లు మంజూరుకాగా ఇప్పటివరకు వాటిని పూర్తిచేయడం లేదన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోడ్డ బాలాజి, మద్యెల రాజయ్య, రఫి, గోపి, శ్రీని వాస్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.