పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2022-05-23T06:08:36+05:30 IST

పర్యాటక ప్రాంతాలైన పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది.

పర్యాటకుల సందడి
కళా గ్రామంలో పర్యాటకులు

అరకులోయ, మే 22: పర్యాటక ప్రాంతాలైన పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్‌ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. గిరిజన మ్యూజియం ఆవరణలో కొందరు పర్యాటకులు కుటుంబ సభ్యులతో బోటు షికారు చేశారు. మరికొందరు జిప్‌ లైనర్‌పై హుషారుగా గడిపారు. 

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వచ్చారు. జలపాతంలో కేరింతలు కొట్టి ఆనందంగా గడిపారు.

Updated Date - 2022-05-23T06:08:36+05:30 IST