యువకుడి హత్య
ABN , First Publish Date - 2020-02-20T09:31:32+05:30 IST
పట్టణంలోని ఆలూరు రోడ్డులో టింకరింగ్ షాపు యజమాని షేక్ బషీర్ అహ మ్మద్ (33) బుధవారం మధ్యాహ్నం హత్యకు గురయ్యా డు.
మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు
గుంతకల్లుటౌన్, ఫిబ్రవరి19: పట్టణంలోని ఆలూరు రోడ్డులో టింకరింగ్ షాపు యజమాని షేక్ బషీర్ అహ మ్మద్ (33) బుధవారం మధ్యాహ్నం హత్యకు గురయ్యా డు. షేక్ బషీర్ అహమ్మద్ తలపై సుత్తితో కొట్టి చంపి డీజిల్ పోసి కాల్చేశారు. పట్టణంలోని ఇందిరానగర్లో నివాసముంటున్న షేక్బషీర్ అహమ్మద్ ఆలూరు రోడ్డులో మస్తాన్ బాయిలర్ కోళ్లఫారం పక్కన ఓ షెడ్లో టిం కరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి షెడ్లోనే ప్రసాద్, కబీర్ అనే డ్రైవర్లు ఓ కారుకు మరమ్మతులు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసాద్, 2-45 గంటలకు కబీ ర్ భోజనానికి వెళ్లారు.
తిరిగి నాలుగు గంటలకు షెడ్కు వచ్చి చూడగా బషీర్ అహమ్మద్ మంటల్లో కాలితున్నాడ ని ప్రసాద్ తెలిపాడు. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చారు. స్థానికులు కాలుతున్న బషీర్ శరీరంపై మట్టి వేసి మంటలను ఆర్పారు. అప్పటికే బషీర్ అహమ్మద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థాని కులు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తలమీద రక్త గాయాలయ్యాయ ని, సుత్తికి, షేడ్లో బండలపైన రక్తపు మరకలు ఉన్నా యని పోలీసులు తెలిపారు. బషీర్ అహమ్మద్కు ఎవరి తోనూ గొడవలు లేవని, తన పని తాను చేసుకుని జీవ నం సాగిస్తున్నాడని, ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారో.. అంటూ బంధువులు రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.