అదృశ్యమైన వ్యక్తి.. శవమై కాల్వలో ప్రత్యక్షం !

ABN , First Publish Date - 2021-11-30T06:48:04+05:30 IST

ఇంటి నుంచి తప్పిపోయిన వ్యక్తి నాలుగు రో జులకు మూసీ చిన్నేటిలో శవమై ప్రత్యక్షమైన సంఘటన సోమవారం భూదానపోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

అదృశ్యమైన వ్యక్తి.. శవమై కాల్వలో ప్రత్యక్షం !
వంగూరి బొందయ్య

మూడు రోజుల క్రితం బయటకు వెళ్లిన వృద్ధుడు 

భూదానపోచంపల్లి, నవంబరు 29: ఇంటి నుంచి తప్పిపోయిన వ్యక్తి నాలుగు రో జులకు మూసీ చిన్నేటిలో శవమై ప్రత్యక్షమైన సంఘటన సోమవారం భూదానపోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన వంగూరి బొందయ్య (90) అనే వ్యక్తి నాలు గు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. ఈ నెల 26న శుక్రవారం ఇంటి నుంచి తప్పిపోయాడు. అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 27వ తేదీన పెద్ద కూతురు మాధవి స్టేషనలో ఫిర్యాదు చేసింది. సోమవారం సాయం త్రం గ్రామశివారులో ఓ గొర్రెల కాపరికి నీటిలో మృతదేహం కనిపించగా పరీలించడంతో బొందయ్యగా గుర్తించాడు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ సైదిరెడ్డి మృతదేహం వద్దకు చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బొందయ్యకు భార్య, వి వాహితులైన నలుగురు కూతుళ్లు ఉన్నారు.  


Updated Date - 2021-11-30T06:48:04+05:30 IST