ఢిల్లీపైకి చైనా ‘లాంగ్‌ మార్చ్‌’ ?

ABN , First Publish Date - 2021-05-07T07:32:17+05:30 IST

అదుపు తప్పిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’పైనే ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టి ఉంది. ఇది మరో 48 గంటల్లో (మే 8 నాటికి) భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో...

ఢిల్లీపైకి చైనా ‘లాంగ్‌ మార్చ్‌’ ?

  • అదుపు తప్పిన రాకెట్‌ హస్తినపై పడే అవకాశం
  • బీజింగ్‌, సిడ్నీ, రియో డీ జెనీరియోకూ ముప్పు
  • ఖగోళజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ అంచనా 
  • రేపు భూమిని తాకొచ్చు: అమెరికా రక్షణ శాఖ 

వాషింగ్టన్‌, మే 6 : అదుపు తప్పిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’పైనే ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టి ఉంది. ఇది మరో 48 గంటల్లో (మే 8 నాటికి) భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో.. రాకెట్‌ ఏ దేశంలో పడుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈనేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్‌ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ  ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ కీలక వ్యాఖ్యలు చేశా రు. చైనా రాకెట్‌.. భారత రాజధాని ఢిల్లీపైనా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. బీజింగ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని, భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చన్నారు. అయితే దాన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమై ఉండొచ్చని జొనాథన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 


Updated Date - 2021-05-07T07:32:17+05:30 IST