దీపాల సందేశం నేడే
ABN , First Publish Date - 2020-04-05T07:01:17+05:30 IST
శానిటైజర్లు మండే స్వభావం కలవని, కాబట్టి దివ్వెలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవద్దని ప్రజలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
దీపాలు మాత్రమే ఆర్పండి
దివ్వెలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు
ప్రజలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : శానిటైజర్లు మండే స్వభావం కలవని, కాబట్టి దివ్వెలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవద్దని ప్రజలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లలోని లైట్లను ఆఫ్ చేసి, తొమ్మిది నిమిషాల పాటు దివ్వెలు, కొవ్వొత్తులు వెలిగించాలని లేదా టార్చ్లైట్లు కానీ, మొబైల్ ఫోన్లోని టార్చ్లైట్లను కానీ వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.