మయూరి తీర్థాన్ని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2021-10-18T06:09:14+05:30 IST

శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థం నుంచి ఐదు కి.మీ. దూరంలో ఉన్న పవిత్ర మయూరి తీర్థాన్ని పరిరక్షించాలని హిందూ ధార్మిక మండలి సభ్యులు కోరారు.

మయూరి తీర్థాన్ని పరిరక్షించాలి
మయూరి తీర్థంలో భక్తుల పూజలు

శ్రీకాళహస్తి, అక్టోబరు 17: స్థానిక భరద్వాజ తీర్థం నుంచి ఐదు కి.మీ. దూరంలో ఉన్న పవిత్ర మయూరి తీర్థాన్ని పరిరక్షించాలని శ్రీకాళహస్తి హిందూ ధార్మిక మండలి సభ్యులు కోరారు. ఆదివారం సభ్యులందరూ తీర్థం చేరుకుని పూజలు చేశారు. పలువురు మాట్లాడుతూ... ఆహ్లాద తీర్థం ప్రాంతంలో కొలువైన పురాతన సుబ్రమణ్యస్వామి, కన్నప్ప, శివాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. చారిత్రక స్థలాలను పరిరక్షించి, పర్యాటక ప్రాంతంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటాద్రి నాయుడు, రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-18T06:09:14+05:30 IST