ఫలక్నుమా నుంచి జారిపడిన వ్యక్తి
ABN , First Publish Date - 2022-01-29T05:17:47+05:30 IST
ఫలక్నుమా నుంచి జారిపడిన వ్యక్తి
- కాపాడిన 108 వాహన సిబ్బంది
నరసన్నపేట: ఉర్లాం-తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి ప్రమాదవశా త్తు పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి ప్రాణాలను 108 వాహన సిబ్బంది కాపాడారు. 108 సిబ్బంది సిబ్బంది రమణ య్య, సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి గురువారం రాత్రి ఉర్లాం రైల్వేసేషన్ చిక్కాలవలస గేట్కు మద్యలో ఒడిశాకు చెందిన వ్యక్తి పడిపోయినట్లు నరసన్నపేట 108 వాహన సిబ్బందికి సమాచారం వచ్చింది. రాత్రి 10 గంటల నుంచి రైల్వే ట్రాక్ వెంబడి సుమారు కిలోమీటరు వరకు వెతకగా ట్రాక్ పక్కన మూలుగుతున్న వ్యక్తిని గమనించి ప్రథమ చికిత్స అందజేసి శ్రీకాకుళం రిమ్స్కు తరలించామన్నారు. శుక్రవారం శ్రీకాకుళం రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.