సహోద్యోగిపై దాడిచేసిన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-05-28T09:27:20+05:30 IST
సహోద్యోగిపై దాడి చేసిన వ్యక్తిని లంగర్హౌస్ పోలీసులు అరెస్టు చేశారు.
మెహిదీపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): సహోద్యోగిపై దాడి చేసిన వ్యక్తిని లంగర్హౌస్ పోలీసులు అరెస్టు చేశారు. లంగర్హౌస్ విద్యుత్శాఖ కార్యాలయంలో కోకాపేటకు చెందిన వెంకటేశం యాదవ్(44), పృథ్వి పనిచేస్తున్నారు. పృథ్వి సక్రమంగా విధులకు రావడం లేదని వెంకటేశం యాదవ్ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చాడు. కోపోద్రిక్తుడైన పృథ్వి ఈనెల 22వ తేదీన వెంకటేశం యాదవ్ను బైక్తో ఢీకొట్టి.. బండరాయితో మోది పారిపోయాడు. నిందితుడు పృథ్విని బుధవారం అరెస్టు చేశారు.