విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-19T06:27:06+05:30 IST

మండలంలోని జేకేపల్లి గ్రామం, కందుకూరివారిపల్లికి చెందిన డేరంగుల మల్లికార్జున (42) మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అమడగూరు, మే 18 : మండలంలోని జేకేపల్లి గ్రామం, కందుకూరివారిపల్లికి చెందిన డేరంగుల మల్లికార్జున (42) మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మల్లికార్జున ఇంటి పైకప్పుకు విద్యుత సరఫరా కావ డంతో రేకులకు సరఫరా కావడంతో విద్యుతషాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు. సో మవారం రాత్రి కురిసిన వర్షానికి రేకులకు విద్యుత వైర్‌లు తగిలి విద్యుత సరఫరా అ యినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య సుగుణమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కు మార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-19T06:27:06+05:30 IST