ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-08T04:51:34+05:30 IST
మండల పరిధిలోని నక్కోనిపల్లెకు చెందిన హరిజన దస్తగిరి (35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
మైలవరం మార్చి 7: మండల పరిధిలోని నక్కోనిపల్లెకు చెందిన హరిజన దస్తగిరి (35) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ వివరాల మేరకు... ఆదివారం ధన్నవాడ గ్రామం నుంచి నక్కోనిపల్లెకు ట్రాక్టర్లో జొన్నచొప్ప తీసుకువస్తు న్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా నడపడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై కూర్చొన్న దస్తగిరి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దస్తగిరి తండ్రి హుసేనప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.