Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో..

ABN , First Publish Date - 2022-08-07T22:26:32+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న (love marriage) దంపతులు జీవితాంతం ఆనందంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది...

Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో..

ప్రేమించి పెళ్లి చేసుకున్న (love marriage) దంపతులు జీవితాంతం ఆనందంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి.. కొందరు వివిధ సాకులు చూపుతూ నిత్యం నరకం చూపిస్తుంటారు. తాజాగా, బీహార్‌లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో చివరకు తల్లిదండ్రులతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 


బీహార్ రాష్ట్రం (Bihar) బెట్టియాలోని (Bettia) బగాహా ప్రాంతానికి చెందిన అనిల్ సాహ్ని, అనితా సాహ్ని (22) అనే యువతీయువకులు (Young men and women) ఒకే వార్డులో నివాసం ఉంటున్నారు. ఒకే ప్రాంతం కావడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. కొన్నాళ్లకు వీరిద్దరి ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఇరు కుటుంబాల వారు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చివరకు ఇద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో 2019 జనవరిలో వీరికి వివాహం జరిపించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో దంపతులిద్దరూ సంతోషంగా ఉండేవారు. అయితే ఏడాది తర్వాత అనితకు.. భర్త, అత్తమామల నుంచి వేధింపులు (Harassing the wife) మొదలయ్యాయి. రూ.3లక్షల నగదుతో పాటూ బైకు కొనివ్వాలని అనితపై ఒత్తిడి తెచ్చేవారు. దీంతో ఇటీవల మళ్లీ పెద్దలు పంచాయితీ చేసి సర్దుబాటు చేశారు. అయితే కొన్ని రోజులకు మళ్లీ వేధింపులు ఎక్కువయ్యాయి.

బావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..


అనిత కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో బైకు కొనివ్వలేకపోయారు. దీంతో అనితను.. భర్త, అత్తమామలు రోజూ చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి.. భర్త, అత్తమామల చేతిలో అనిత హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కూతురికి విషం ఇచ్చి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త అనిల్ సాహ్ని, తండ్రి ఛోటేలాల్ సాహ్ని, తల్లి చింతాదేవిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం..



Updated Date - 2022-08-07T22:26:32+05:30 IST