ప్రత్తిపాడులో వలస కూలీల ఆకలి కేకలు
ABN , First Publish Date - 2020-03-31T09:11:46+05:30 IST
ప్రత్తిపాడు మండల కేంద్రంలో వలస కూలీల ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. కర్నూలు
గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రత్తిపాడు మండల కేంద్రంలో వలస కూలీల ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీలు కొద్ది రోజుల క్రితం మిరపకాయలు కోసేందుకు ఇక్కడకు వచ్చారు. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ కారణంగా వారు ఇక్కడే ఉండిపోయారు. పనులు లేక అర్ధాకలితో బతుకీడుస్తున్నారు. మండల కేంద్రంలోని కుమ్మరి బజార్లో ఉంటున్న రైతు వెంకట్రావు కొట్టంలో వీరు తలదాచుకుంటున్నారు. తమని స్వంత ఊరికి పంపించాలని వారు ప్రాధేయపడుతున్నారు.
అలా వీలు కుదరకపోతే భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎన్వీవీ సత్యన్నారాయణ దృష్టికి తీసుకెళ్లగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ప్రత్తిపాడు తహసీల్దార్, డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.