దైవ దర్శనానికి వెళ్తే ఇల్లు దోచేశారు
ABN , First Publish Date - 2021-04-08T05:52:11+05:30 IST
దైవ దర్శనం కోసం వెళ్తే దొంగలు ఇళ్లు గుల్ల చేశారు.
తూప్రాన్, ఏప్రిల్ 7: దైవ దర్శనం కోసం వెళ్తే దొంగలు ఇళ్లు గుల్ల చేశారు. ఈ సంఘటన తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లిలో మంగళవారం రాత్రి చోటు జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం... పోతరాజుపల్లికి చెందిన సుగుణాల బ్రహ్మచారి గత సోమవారం కుటుంబ సభ్యులతో కలసి దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్లాడు. హైవే రోడ్డుకు పక్కనే ఉన్న బ్రహ్మచారి ఇంటి తాళాలను గుర్తు తెలియని దొంగలు మంగళవారం రాత్రి పగలగొట్టారు. ఇంటి చుట్టుపక్కల గల వ్యక్తులు గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోని అల్మారాలో ఉంచిన నగదు, బంగారు అభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. బాధితుడు తిరిగివచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.