ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు చేరవేయాలి
ABN , First Publish Date - 2022-05-18T06:58:41+05:30 IST
వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరతిగతిన మిల్లులకు చేర్చాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.
ఖానాపూర్, మే 17 : వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరతిగతిన మిల్లులకు చేర్చాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని రాజూరా గ్రామంలో ఖానాపూర్ పీఏసీఎస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహాకులను ఆదేశించారు. అనంతరం సింగాపూర్ గ్రామంలో ఈదురుగాలులకు ఇళ్లు కూలిన బాధితులను పరామర్శించారు. నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప సత్యనారాయణరెడ్డి, మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కరిపె శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు పార్శపు శ్రీనివాస్, గజేందర్ తది తరులున్నారు.