పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

ABN , First Publish Date - 2022-01-21T04:37:54+05:30 IST

పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల సూర్యనారాయణ కోరారు.

పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
తహసీల్దార్‌ రామారావుకు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం

పెందుర్తి, జనవరి 20: పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ పైల రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర స్థితిలో రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇవ్వడం సాహసోపేత నిర్ణయమని, అయితే దీన్ని 27 శాతానికి పెంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T04:37:54+05:30 IST