రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , First Publish Date - 2020-07-04T10:31:28+05:30 IST
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం మండలంలో అభివృద్ధి పనులకు
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కాసిపేట, జూలై 3: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రైతుల కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకా లను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతు లు సంతోషంగా ఉన్నారని తెలిపారు. జలహితంలో కాలువల పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు సమీక్ష సమావేశాలు నిర్వహించుకునేందుకు రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నారన్నారు. ముత్యంపల్లి డంపింగ్యార్డును ప్రారంభిం చి, రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేసి మొక్కలు నాటారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ఎంపీపీ విక్రమ్రావు, సర్పంచు ఆడె బాదు, సింగిల్ విండో చైర్మన్ నీలారాంచందర్, ఏడీఏ సురేఖ, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో ఆలీం, నాయకులు పాల్గొన్నారు.