మొక్కజొన్నలను ప్రభుత్వమే కొంటుంది
ABN , First Publish Date - 2020-11-01T06:45:06+05:30 IST
మొక్కజొన్నలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కె.మహే్షరెడ్డి తెలిపారు. పరిగి మార్కెట్ యార్డులో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డితో కలసి శనివారం మొక్కజొన్న
పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డి
పరిగి(రూరల్)/దోమ : మొక్కజొన్నలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కె.మహే్షరెడ్డి తెలిపారు. పరిగి మార్కెట్ యార్డులో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డితో కలసి శనివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దోమ మండ ల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ, క్వింటాకు రూ.1850 చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్రావు, మార్కెట్ చైర్మన్ అజారొద్దీన్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుందా అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, దోమ జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, నాయకులు ప్రవీణ్రెడ్డి, బాబయ్య, పర్శమోని బాబయ్య పాల్గొన్నారు. దోమలో జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, సొసైటీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు రాజగోపాలచారి, బి.లక్ష్మయ్య, శ్రీనివా్సరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
అంగన్వాడీల ఖాళీలు అందజేయాలి
పరిగి: గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీల వివరాలు అందజేయాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎ్సపై జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీలు అ రవింద్రావు, సత్యమ్మ, అనుసూజమ్మ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, నాగిరెడ్డి, రాందా్సనాయక్, సీడీపీవో ప్రియదర్శిని పాల్గొన్నారు.
మద్దతు ధరతో మక్కల కొనుగోలు
ధారూరు: వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్నకు మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి తెలిపారు. శనివారం ఆమె మండల ఏవో జ్యోతితో కలిసి తరిగోపుల గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి, కంది పంటలను పరిశీలించారు. టీఆర్ఎ్సవీ జిల్లా బాధ్యుడు కుమ్మరి శ్రీనివాస్, రైతులు ఉన్నారు.