దైవ దర్శనం కోసం రాష్ట్రం దాటి వచ్చిన కుటుంబం.. హోటల్ గది నుంచి ఉదయాన్నే బయటికి వెళ్లిన బాలిక.. ఐదు రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2022-09-01T23:49:58+05:30 IST

ఆ కుటుంబం బీహార్ నుంచి రాజస్థాన్‌కు దైవ దర్శనం కోసం వచ్చింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయిన కూతురు.. ఉదయం లేచి చూడగా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు..

దైవ దర్శనం కోసం రాష్ట్రం దాటి వచ్చిన కుటుంబం.. హోటల్ గది నుంచి ఉదయాన్నే బయటికి వెళ్లిన బాలిక.. ఐదు రోజుల తర్వాత..

ఆ కుటుంబం బీహార్ నుంచి రాజస్థాన్‌కు దైవ దర్శనం కోసం వచ్చింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయిన కూతురు.. ఉదయం లేచి చూడగా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందో అని కంగారుగా వెతుకుతుండగా.. ఐదు రోజుల తర్వాత అందిన సమాచారంతో అంతా షాక్ అయ్యారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం దర్భంగా పరిధి కంథోల్ గ్రామానికి చెందిన ఓ దుస్తుల వ్యాపారి.. కుటుంబంతో సహా ఆగస్టు 25న రాజస్థాన్ రాష్ట్రం మెహదీపూర్ ప్రాంతంలో ఉన్న బాలాజీ మహారాజ్ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. అంతా కలిసి రాత్రి అతిథి గృహంలో బస చేశారు. అయితే ఉదయం లేవగానే వారి కుమార్తె నేహా(15).. కనిపించలేదు. దీంతో అంతా కంగారుపడ్డారు. తెలిసిన ప్రాంతాల్లో విచారించినా ఫలితం లేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మెహందీపూర్ సమీపంలోని డ్రెయిన్‌లో శవమై కనిపించింది.

ఇంట్లో నగ్నంగా తల్లీకూతుళ్ల మృతదేహాలు.. 10 రోజుల తర్వాత కొడుకు రాకతో బయటపడిన దారుణం.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..


బాలిక సోదరుడు గుర్తించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హోటల్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఉదయాన్నే బాలిక హోటల్ నుంచి బయటికి వెళ్తున్నట్లు కనిపించింది. పోలీసులు మాట్లాడుతూ, బాలిక అదృశ్యంపై తమకు ఇంత వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. మృతికి గత కారణాలు తెలుస్తాయని చెప్పారు. ఈ ఘటనతో బాలిక స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

లేవరా.. కళ్లు తెరువు అంటూ ఏడుస్తూ పిలుస్తుండగానే తల్లి ఒడిలోనే కన్నుమూసిన 5 ఏళ్ల బాలుడు.. ఆస్పత్రి ముందే దారుణం..!



Updated Date - 2022-09-01T23:49:58+05:30 IST