బాలిక అదృశ్యం

ABN , First Publish Date - 2022-05-21T07:08:54+05:30 IST

నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన లిఖిత(13) అదృశ్యమైంది.

బాలిక అదృశ్యం
లిఖిత(ఫైల్‌ ఫోటో)

చిత్తూరు, మే 20: నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన లిఖిత(13) అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఈ నెల 18వ తేదీన గంగజాతరకు వెళ్లి వస్తామని చెప్పిన బాలిక తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారిళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున్‌ తెలిపారు.


Updated Date - 2022-05-21T07:08:54+05:30 IST