ముస్లిం యువకుల ఔదార్యం
ABN , First Publish Date - 2021-05-13T07:28:20+05:30 IST
కరోనాతో మృతి చెందిన పట్టణంలోని ఓ యువకు డికి ఇస్లాంపురకాలనీకి చెందిన ముస్లిం యువకులు బుధవారం అంత్యక్రియలు నిర్వహించి ఔదార్యం చాటారు.
యువకుడికి అంత్యక్రియలు
మిర్యాలగూడ టౌన్, మే 12: కరోనాతో మృతి చెందిన పట్టణంలోని ఓ యువకుడికి ఇస్లాంపురకాలనీకి చెందిన ముస్లిం యువకులు బుధవారం అంత్యక్రియలు నిర్వహించి ఔదార్యం చాటారు. పట్టణంలోని శాంతినగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్(34) కరోనాతో హైదరాబాద్లో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని బుధవారం ఉదయం మిర్యాలగూడకు తీసుకు వచ్చారు. ఆ యువకుడి అంత్యక్రియలు నిర్వహిం చడానికి బంధుమిత్రులెవరూ విషయం తెలుసుకున్న మైనార్టీ యువకులు గయాస్, ఉబేద్, జహంగీర్, ఖదీర్, యూనుస్, బషీర్, ఉబేర్, మ్రాన్, సజాద్లు యువకుడి మృతదేహాన్ని అంబులెన్స్లో శ్మశానవాటికకు తరలించి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వ హించి ఔదార్యం చాటారు.