అధికార లాంచనాలతో పాపారావు అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-07-09T10:55:49+05:30 IST

ఏపీఎస్పీ హెచ్‌సీ బొడ్డ పాపారావు (57) మృ తదేహానికి బుధవారం అధికార లాంచనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌

అధికార లాంచనాలతో పాపారావు అంత్యక్రియలు

టెక్కలి, జూలై 8 : ఏపీఎస్పీ హెచ్‌సీ బొడ్డ పాపారావు (57) మృ తదేహానికి బుధవారం అధికార లాంచనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై మంగళవారం ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎస్కార్ట్‌ వాహనం టైరు పేలిన ఘటనలో పాపారావు మృతి చెందారు. ఈమేరకు ఆయన స్వగ్రామం టెక్కలి మండలం బన్నువాడలో అంత్యక్రియలు జరిగాయి.  ఏఎస్పీ పి.సోమశేఖర్‌, కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి, ఇంటలిజెన్స్‌ డీఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ ఎన్‌ఎస్‌ శేఖర్‌ మృతదేహం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.


ఏపీఎస్పీ సిబ్బంది మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు. పోలీస్‌ సంక్షేమ సంఘం నుంచి జిల్లా నాయకులు అప్పన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందించారు. సీఐలు పి.నీలయ్య, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహమూర్తి, ఎస్‌ఐ గణేష్‌ పాల్గొన్నారు. పాపారావు మృతికి టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - 2020-07-09T10:55:49+05:30 IST