ఎడ్సెట్ మొదటిరోజు ప్రశాంతం
ABN , First Publish Date - 2020-10-02T08:16:40+05:30 IST
బీఈడీ రెండేళ్ల కో ర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2020లో
హైదరాబాద్ సిటీ, అక్టోబర్1 (ఆంధ్రజ్యోతి): బీఈడీ రెండేళ్ల కో ర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ ఎడ్సెట్-2020లో గురువారం సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 53 పరీ క్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 14,691 మంది విద్యార్థులకుగానూ, 10,271 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 69.9హాజరు శాతం నమోదైన్నట్లు టీఎస్ ఎడ్సెట్-2020 కన్వీనర్ ప్రొఫెసర్ టి.మృణాళిని తెలిపారు.