బీజేపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది

ABN , First Publish Date - 2021-12-03T05:56:24+05:30 IST

బీజేపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎన్‌.రామారావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 294వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కార్మికుల నుద్దేశించి గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం మొండిగా విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిందన్నారు.

బీజేపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది
రిలే దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న రామారావు

కూర్మన్నపాలెం, నవంబరు 2: బీజేపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఎన్‌.రామారావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 294వ రోజు  రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కార్మికుల నుద్దేశించి గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం మొండిగా విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిందన్నారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ దేశంలో కార్మిక, కర్షక, ఐక్యత కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకట్రావు మాట్లాడుతూ  కర్మాగారాన్ని ప్రైవేటుకు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T05:56:24+05:30 IST