విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T06:13:52+05:30 IST

పార్లమెంట్‌ సమావేశాల్లో విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ (టీ ఎస్‌పీజేఏసీ) ఉద్యోగుల జిల్లా శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

టీఎస్‌పీజేఏసీ ఉద్యోగుల జిల్లా శాఖ డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 8: పార్లమెంట్‌ సమావేశాల్లో విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ (టీ ఎస్‌పీజేఏసీ) ఉద్యోగుల జిల్లా శాఖ నాయకులు డిమాండ్‌  చేశారు.  సో మవారం జగిత్యాల జిల్లాలో ఉదయం 6గంటల నుంచి విధులు బహిష్క రించిన ఉద్యోగులు, జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యుత్‌ ప్రగతి భవన్‌ (ఎస్‌. ఇ) కార్యాలయం ఎదుట నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని విద్యుత్‌ ఉద్యోగులమంతా త మ డిమాండ్ల సాధనకు విధులు బహిష్కరించామని, కేంద్రం తన మొండి వైఖరి మార్చుకోకుంటే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న వివిధ కేడర్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:13:52+05:30 IST