విద్యుత్‌ సవరణ బిల్లు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-10T06:24:41+05:30 IST

సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని సీఐటీయూ రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ సవరణ బిల్లు రద్దు చేయాలి
బిల్లు ప్రతులను దహనం చేస్తున్న రైతు సంఘ నాయకులు

రైతు సంఘ నాయకుల డిమాండ్‌ 

తిరువూరు, ఆగస్టు 9: సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ సవరణ బిల్లును తక్షణం  రద్దు చేయాలని సీఐటీయూ రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణ, మండలంలోని రోలుపడి గ్రామంలో మంగళవారం విద్యుత్‌ సవరణ బిల్లు  ప్రతులను దహనం చేశారు.  రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సి.హెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ,  విద్యుత్‌ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రైతుల అందోళనతో  రద్దుచేసిన ప్రధాని మోదీ దొడ్డిదారిన బిల్లు అమోదంకోసం ప్రయత్నించటం శోచనీయమన్నారు.  నిరసన కార్యక్రమంలో మేకల నాగేంద్రప్రసాద్‌, మర్సకట్ల ప్రభాకరరావు, ఆలీబాబా, భద్రం, బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి, ఎస్‌.కుమారి,  తదితరులు పాల్గొన్నారు.

                    




Updated Date - 2022-08-10T06:24:41+05:30 IST