ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2022-07-02T05:00:39+05:30 IST
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.
వెల్దుర్తి జూలైౖ 1: ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని హల్దీవాగు బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. మంగళపర్తి గ్రామానికి చెందిన మన్నె రమేష్(30) అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ట్రాక్టర్ మరమ్మతుల కోసం రమేష్ శ్రీనివా్సతో కలిసి మెదక్కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఉప్పు లింగాపూర్ హల్దీవాగు బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాస్ పక్కకు దూకి తప్పించుకోగలిగాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.