వ్యాక్సిన్‌ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:01:25+05:30 IST

మండల పరిధిలోని పీహెచ్‌సీలో శనివారం నిర్వహించనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పకడ్బందీగా ఉండాలని జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జ్యోత్స్న తెలిపారు.

వ్యాక్సిన్‌ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి
సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి జ్యోత్స్న

పెండ్లిమర్రి, జనవరి 15: మండల పరిధిలోని పీహెచ్‌సీలో శనివారం నిర్వహించనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పకడ్బందీగా ఉండాలని జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జ్యోత్స్న తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి 500 మందికి సరిపడు కొవిడ్‌ వ్యాక్సిన్లను ఇచ్చామని, వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి విధులకు హాజరై టీకా పంపిణీని పక్కాగా చేపట్టాలన్నారు. అనంతరం టీకా వేయు గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యుడు బాలకొండ్రాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:01:25+05:30 IST