వ్యాక్సిన్ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-01-16T05:01:25+05:30 IST
మండల పరిధిలోని పీహెచ్సీలో శనివారం నిర్వహించనున్న కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పకడ్బందీగా ఉండాలని జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జ్యోత్స్న తెలిపారు.
పెండ్లిమర్రి, జనవరి 15: మండల పరిధిలోని పీహెచ్సీలో శనివారం నిర్వహించనున్న కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పకడ్బందీగా ఉండాలని జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జ్యోత్స్న తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి 500 మందికి సరిపడు కొవిడ్ వ్యాక్సిన్లను ఇచ్చామని, వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి విధులకు హాజరై టీకా పంపిణీని పక్కాగా చేపట్టాలన్నారు. అనంతరం టీకా వేయు గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యుడు బాలకొండ్రాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.