రైల్లోంచి పడి ప్రయాణికుడి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-17T05:12:01+05:30 IST

రైల్లోంచి పడి ప్రయాణికుడి దుర్మరణం

రైల్లోంచి పడి ప్రయాణికుడి దుర్మరణం
రైల్వే ట్రాక్‌ పక్కన పడి ఉన్న హైమత్‌ మృతదేహం

నవాబుపేట, మే 16: ప్రమాదవశాత్తు రైలులోనుంచి పడి ఓ ప్ర యాణికుడు మృతిచెందిన ఘటన గూల్లగొడ రైల్యేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకు లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన హైమత్‌(43) కుటు ంబీకులతో వారం క్రితం కర్ణాటక లోని బాల్కి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో హైదబారాద్‌ వస్తుండగా గూల్లగూడ స్టేషన్‌ సమీపానికి రాగానే డోర్‌ తగిలి కిందపడ్డాడు. కుటుంబీకులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమి చ్చారు. వచ్చి చూసే సరికే హైమత్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హైమత్‌కు భార్య రుబీనాబేగం, ముగ్గు రు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌ పరిశీలించి సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-05-17T05:12:01+05:30 IST