భర్త మృతిని తట్టుకోలేక ఆస్పత్రిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-25T13:17:50+05:30 IST
చికిత్స పొందుతున్న తన భర్త మృతిచెందాడన్న సమాచారం తెలుసుకుని ఒక మహిళ ఆస్పత్రి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోడ్ జిల్లా భవానీ కలింగరాయన్పాళయంకు...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): చికిత్స పొందుతున్న తన భర్త మృతిచెందాడన్న సమాచారం తెలుసుకుని ఒక మహిళ ఆస్పత్రి 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోడ్ జిల్లా భవానీ కలింగరాయన్పాళయంకు చెందిన శేఖరన్ (50), నాగరత్నం (46) దంపతులకు వివాహమై 26 ఏళ్లు దాటినా, వారికి పిల్లలు కలుగలేదు. ఈ నేపథ్యంలో, శేఖరన్ మంగళవారం పన్నారి రోడ్డులో సంభవించిన ప్రమాదంలో గాయపడ్డాడు. చుట్టుపక్కల వారు ఆయనను కోయంబత్తూర్ కరుంపాళయంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో అతనికి చికిత్సలు నిర్వహిస్తుండగా నాగరత్నం గది వెలుపల విలపిస్తూ కూర్చొంది. కొద్దిసేపటికి చికిత్సలు ఫలించక శేఖరన్ మృతిచెందినట్టు వైద్యులు నాగరత్నంకు తెలిపారు. వెంటనే ఆమె ఆస్పత్రి 7వ అంతస్తుకు వెళ్లి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై కోవిల్పాళయం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.